- చేపమాంసాన్ని ఆవనూనెతో కలిపి తినకూడదు.
- చేపలు తిన్నప్పుడు పెరుగు తినరాదు
- పావురం మాంసాన్ని కూడా ఆవనూనెతో కలిపి తినకూడదు.
- కోడిమాంసాన్ని, దుప్పి మాంసాన్ని పెరుగుతో కలిపి తినకూడదు.
- కుసుమనూనెతో మేకమాంసాన్ని తినకూడదు.
- పాలలో ఉప్పు కలిపి త్రాగకూడదు.
- ద్రాక్ష సారాతో బచ్చలి కూర తినకూడదు.
- ముల్లంగితో మినప్పప్పు కలపకూడదు.
- పెరుగు, మజ్జిగ కలిపి అరటిపండు తినకూడదు.
- పెరుగు, బెల్లం, తేనె, నెయ్యితో నిమ్మరసం కలపకూడదు.
- మద్యం, పెరుగు, తేనె వీటిలో వేడి పదార్థములు కలిపి తినకూడదు.
- పాయసము, మద్యము కలిపి తీసుకోకూడదు.
- తేనె, నెయ్యి సమభాగాల్నికలిపి తీసుకోరాదు.
- తేనె, తామర గింజలు కలిపి తీసుకోరాదు.
- పంచదార పానకము, మద్యము, తేనెతో కలిపి తీసుకోకూడదు.
- ఆవనూనెలో వేయించిన మష్రూమ్స్ తినకూడదు.
- తెలగపిండితో కలిపి బచ్చలి తినకూడదు.
- నీటి కొంగ మాంసాన్ని, మద్యాన్ని కలిపి తీసుకోకూడదు.
- ఉడుము మాంసం, నెమలి మాంసం ఆముదం కలిపి వండకూడదు.
- శరీరం వేడిగా ఉన్నప్పుదు ఒకేసారి చల్లని నీటిలో దిగకూడదు.
- ఒళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు వేడిపాలు త్రాగరాదు. అలాగే చేస్తే చర్మవ్యాధులు వచ్చే ఆవకాశం ఉంది. రక్త సంబంధమైన వ్యాధులు కూడా వచ్చె అవకాశం ఉంది.
- ఆయాసం కల్గించే పనిని చేసిన వెంటనే భోజనం చేయకూడదు.
- పాత ధాన్యం, కొత్త ధాన్య్ం కలిపి వండకూడదు.
- పచ్చివి, పండినవిగా ఉన్న పండ్లు కలిపి తినరాదు.
- పాలు, ఉలవలు కలిపి తినకూడదు. ఎందుకంటే పాలు శీతల గుణాన్ని కలిగించేవి. ఉలవలు ఉష్ణగుణాన్ని కల్గించేవి. ఇది అసదృశ గుణ విరుద్ధం అంటారు.
- పాలు, పనసపండు కలిపి తినరాదు. దీంట్లో పాలు, పనస పండు రెండూ శీతల గుణాన్నే కల్గి ఉన్నా అవి స్వభావంగానే సదృశగుణ విరుద్ధాలు అని చెబుతుంది ఆయుర్వేదం.
- పాలు చేపలు కలిపి తినకూడదు. ఇది సదృశ అసదృశ గుణ విరుద్ధాలకు ఉదాహరణ.
- వేడిచేసిన పెరుగు తినకూడదు. ఇది సంస్కార విరుద్ధం. అనగా పెరుగును వేదిచేత సంస్కరించాం కాబట్టి ఇది విరుద్ధం.
- సమానమైన పరిమాణంలో తేనె, నెయ్యి తీసుకోకూడదు. ఇది మాత్రా విరుద్ధం.
- చవిటి నేలలో ఉన్న నీరు వ్రాగరాదు. ఇది మాత్రా విరుద్ధం.
- రాత్రి పూట పేలాలు, పాప్కార్న్ లాంటివి కేవలం పిండిలా పొడిగా ఉండే పదార్థాలను తినకూడదు. అది కాల విరుద్ధం.
- పిండితో చేసిన ఉండలను తింటూ మధ్యలో నీరు త్రాగకూడదు. ఇది సంయోగ విరుద్ధం...
Monday, 24 May 2021
విరుద్ధ ఆహారాలు
Labels:
Arogyam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment