కాన్బెర్రా: ఆస్ట్రేలియాకు
చెందిన చేపలు పట్టే ఓ వ్యక్తి వలకు వింత ప్రాణులు దొరికాయి. నార్తర్న్
టెరిటొరి వాటర్స్ ప్రాంతంలో దాదాపు 30 మీటర్ల లోతులోని ఓ రహస్యప్రదేశంలో ఈ
జీవులు లభించాయి. పెద్దకళ్లు, ఎరుపు రంగు, శరీరంపై ముల్లులు, ముందు రెండు
కొమ్ములు ఉన్న ఈ జీవులను చూసి చేపలు పట్టే వ్యక్తి భయభ్రాంతులకు గురయ్యాడట.
సముద్రజీవులపై అవగాహన ఉన్న నిపుణులు వీటిని పరిశీలించారు. మొదటిసారిగా ఈ
ప్రాణులను చూస్తున్నామని, కొన్ని జాతుల చేపలు సముద్రంలో చాలాలోతులో
ఉంటాయని, ఇవి ఏ జాతికి చెందిన చేపలో లేదా మరేదైనా ప్రాణులో త్వరలోనే
తేల్చనున్నామని నిపుణులు తెలిపారు.

No comments:
Post a Comment