Friday, 21 October 2016

స్టూడెంట్‌ని రోడ్డు గుంత చంపేసింది

కూకట్‌పల్లి (హైదరాబాద్‌): రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ ఎస్‌ఎస్‌కాలనీకి చెందిన అరుణకుమార్‌(25) ఎంటెక్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హఫీజ్‌పేట నివాసి సోమశేఖర్‌(32)తో కలిసి ద్విచక్రవాహనంపై మూసాపేట వైపు వెళ్తుండగా కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న అరుణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న గుంతలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment