సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను రాచకొండ పోలీసులు
అరెస్టు చేశారు. ఆన్లైన్లో వాహనాల విక్రయం పేరుతో ఈ ముఠా మోసాలకు
పాల్పడుతోందంటూ బాధితుడు లవీశ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై
పోలీసులు కేసు నమోదు చేశారు. లవీశ్కుమార్ నుంచి ఈ ముఠా రూ.1.85లక్షలు
వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాను పోలీసులు బెంగళూరులో
అరెస్టు చేశారు.
No comments:
Post a Comment