ఈ ఏడాది విడుదలైన
సినిమాల్లో అల్లు అర్జున్ ‘సరైనోడు’, ఎన్టీయార్ ‘జనతాగ్యారేజ్’ సినిమాలు
బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఒక్కో సినిమా 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు
కలెక్ట్ చేశాయని ఆయా సినిమాల నిర్మాతలు ప్రకటించారు. అయితే అసలు
కలెక్షన్లు ఎంతన్నది మాత్రం నిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ,
ఫ్యాన్స్ మాత్రం ఎవరి వాదనలను వారు సమర్థించుకుంటున్నారు.
గతంలో
అయితే ఓ సినిమా ఎంత పెద్ద హిట్టు అనేది లెక్కెయ్యడానికి ఆ సినిమా ఎన్ని
కేంద్రాల్లో వంద రోజులు ఆడిందని లెక్కేసేవారు. ప్రస్తుతం అలా వందేసి
రోజులపాటు థియేటర్లలో సినిమాలు ఉండడం చాలా అరుదైపోయింది కాబట్టి కలెక్షన్ల
మీద ఆధారపడుతున్నారు. అయితే ఈ కలెక్షన్ల లెక్కలన్నీ ఫేక్ అనే విషయం
తెలిసిందే.

No comments:
Post a Comment