అరుదుగా కనిపించే రెండు తలల ఎరుపు ఇసుక రంగు పాము(బో)ను బెంగళూరు పోలీసులు
రక్షించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పామును వారి
దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వణ్యప్రాణి వాణిజ్య మార్కెట్లో
దీని విలువ రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురు
వ్యక్తులకు అరుదైన జంతువులను అక్రమంగా తరలించే ముఠాతో ప్రమేయం ఉన్నట్లు
చిక్కజల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాములను పట్టుకునే వారి
నుంచి తక్కువ మొత్తంలో ఏజెంట్లు కొనుగోలు చేసి తర్వాత వీటిని భారీ లాభాలకు
అమ్ముకుంటారని పోలీసులు అంటున్నారు. నిందితుల నుంచి రక్షించిన పామును
బన్నేర్ఘట్ట జాతీయ పార్క్కు చేర్చినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఇండియాలో రెండు తలల పాము తమ దగ్గర ఉంటే అదృష్టం వరిస్తుందని పులువురి
నమ్మకం అంతే కాకుండా చేతబడుల కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఆసియా
ఖండంలోని కొన్ని దేశాల్లో వీటిని మందులు తయారీకి వినియోగిస్తారు.
బెంగళూరులోని ఆర్మీ లేఅవుట్ సమీపంలో వేంకటేశ్వర కాలేజీ దగ్గర ఆదివారం
సాయంత్రం 4:30 ప్రాంతంలో.... రెండు తలల ఎరుపు రంగు పామును అమ్మడానికి ముఠా
ప్రయత్నిస్తోందన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకోడానికి పథకం
వేశారు. ప్రైవేట్ వాహనంలో వచ్చిన నిందితులు ఎప్పటిలాగే పామును అమ్మడానికి
ప్రయత్నం చేశారు. ఈ మారు వేషంలో వచ్చిన పోలీసుల వారి ప్రయత్నాన్ని వమ్ము
చేశారు. రూ.లక్ష బేరం కుదుర్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా పోలీసులు వచ్చి
వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముని కృష్ణ (28), గోపాల్
(22), పునీత్ (21), కార్తీక్ (18)గా గుర్తించారు. ఇలాంటి అరుదైన పాములు
కర్ణాటకలోని బేగేపల్లి, ములబగల్, కోలార్, తుముకూరులోని సిర ప్రాంతాల్లో
వీటి ఉనికి ఎక్కువని అధికారులు తెలిపారు. వీటిని అక్రమ రవాణా ద్వారా
అమ్ముతుంటారని, విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఇవి తమ దగ్గర
ఉంటే అదృష్టంగా భావిస్తారు. అలాగే జపాన్, మలేసియా, సింగపూర్, చైనా దేశాలకు
వీటిని స్మగ్లింగ్ చేస్తారని, స్థానికుల నుంచి కొనుగోలు చేసిన బో పాములను
అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ మొత్తానికి
అమ్ముతారని నార్త్-ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీఎస్ హర్ష తెలిపారు.

No comments:
Post a Comment