Wednesday, 15 June 2016

హత్య కేసులో 18 సింహాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు !

అహ్మదాబాద్: ముగ్గురు మనుషులను హత్య చేశాయన్న అనుమానంతో 18 సింహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. అంతేకాదు, ఆ 18 సింహాల పాదముద్రలను కూడా పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించడం విశేషం. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌కు చెందిన మగ సింహమే ఈ హత్యలకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే గానీ నిజమైతే సింహానికి జీవిత ఖైదు విధించే అవకాశముంది. గిర్ నేషనల్ పార్క్ ఏషియన్ సింహాలకు నిలయం. ఈ పార్క్‌లో దాదాపు 4వందల సింహాలు ఉన్నాయని అనధికారికంగా లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే జూలో 270 సింహాలు ఉండటానికే వీలుందట. అందువల్లే పార్క్‌లోని కొన్ని సింహాలను అడవిలో వదిలేస్తున్నారట. అవి జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను గాయపరుస్తున్నాయి.

No comments:

Post a Comment