అహ్మదాబాద్: ముగ్గురు
మనుషులను హత్య చేశాయన్న అనుమానంతో 18 సింహాలను పోలీసులు అదుపులోకి
తీసుకుని విచారిస్తున్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ ఘటన
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. అంతేకాదు, ఆ 18 సింహాల పాదముద్రలను
కూడా పోలీసులు ఫోరెన్సిక్కు పంపించడం విశేషం. గుజరాత్లోని గిర్ నేషనల్
పార్క్కు చెందిన మగ సింహమే ఈ హత్యలకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదే గానీ నిజమైతే సింహానికి జీవిత ఖైదు విధించే అవకాశముంది. గిర్ నేషనల్
పార్క్ ఏషియన్ సింహాలకు నిలయం. ఈ పార్క్లో దాదాపు 4వందల సింహాలు ఉన్నాయని
అనధికారికంగా లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే జూలో 270 సింహాలు ఉండటానికే
వీలుందట. అందువల్లే పార్క్లోని కొన్ని సింహాలను అడవిలో వదిలేస్తున్నారట.
అవి జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను గాయపరుస్తున్నాయి.

No comments:
Post a Comment