హరియాణాలో రెండు, ఉత్తర ప్రదేశ్లో 11, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 3, రాజస్థాన్లో 4, ఉత్తరాఖండ్లో 1, జార్ఖండ్లో 2 సీట్లకు జరిగిన పోలింగ్ ఫలితాలిలా ఉన్నాయి..
* రాజస్థాన్లోని నాలుగు స్థానాల్లో భాజపా విజయం సాధించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా.. భాజపా అభ్యర్థులు గెలుపొందారు.
* ఉత్తరాఖండ్లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా విజయం సాధించారు.
* మధ్యప్రదేశ్లో మూడు స్థానాలకు గానూ.. రెండింటిలో భాజపా గెలుపొందింది. భాజపా నుంచి ఎంజే అక్బర్, అనిల్ మాధవ్ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో వివేక్ టంకా గెలుపొందారు.
* ఝార్ఖండ్లో రెండు స్థానాల్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మహేశ్ పొడ్డార్ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు.
* కర్ణాటకలోని నాలుగు సీట్లకు గానూ.. మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. ఒకస్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భాజపా తరఫున విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, కేసీ రామ్మూర్తి గెలుపొందారు.
* హరియాణాలోని రెండు స్థానాలకు గానూ.. ఒక స్థానంలో భాజపా తరఫున కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ విజయం సాధించగా.. మరో చోట భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర గెలుపొందారు.
* ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలకు గానూ.. సమాజ్వాదీ పార్టీ 7, బీఎస్పీ 2, భాజపా, కాంగ్రెస్ ఒకటి చొప్పున సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ నుంచి కపిల్సిబల్ గెలుపొందారు.

No comments:
Post a Comment