Friday, 10 June 2016

పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక

వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదనను అమెరికా అర్థం చేసుకుంది. ‘‘మా పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తోంది’’ అని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా స్పందిస్తూ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేసింది. భారతదేశంలో దాడులకు పాకిస్థాన్‌ భూభాగంలో కుట్ర జరగకుండా జాగ్రత్త వహించాలని పాకిస్థాన్‌కు స్పష్టంగా చెప్పింది. అమెరికా హోం శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మాట్లాడుతూ భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని పాకిస్థాన్‌ను ప్రోత్సహించే చర్యల్లో ఇదొకటని పేర్కొన్నారు.
        పరస్పర సహకారం వల్ల పాకిస్థాన్, భారతదేశం లాభపడతాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా చర్చలకు ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశంలో దాడులకు పాకిస్థాన్ భూభాగంలో ప్రణాళిక రచన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పాక్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న ఉగ్రవాదుల సమస్యను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

No comments:

Post a Comment