Friday, 10 June 2016

స్వాతంత్య్ర సమరయోధుడి కన్నుమూత...


    కోల్‌కతా: స్వాతంత్య్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో కలిసి పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ గురువారం మరణించారు. 99 ఏళ్ల గంగూలీ గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పశ్చిమ్‌బంగా స్వాతంత్య్ర యోధుల సలహాదారుల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన బుధవారం కూడా విధులకు హాజరయ్యారు.      గంగూలీ ఢాకా(ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని) జిల్లాలోని విక్రంపూర్‌లో జన్మించారు. తన పదమూడవ ఏటనే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ప్రఫుల్ల చంద్రఘోష్‌కి ఉత్తరాల రాయబారిగా ఉండేవాడు. పదిహేనేళ్ల వయసులోనే జైలుకెళ్లారు. 1930లో తంగలుబెరియా పోలీస్‌ స్టేషన్‌ ముట్టడించినందుకు రెండేళ్లు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 1946లో కోల్‌కతా, నోవఖలిలో జరిగిన అల్లర్ల సమయంలో గాంధీజీతో కలిసి శాంతియుత ఉద్యమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment