సూపర్స్టార్ రజినీకాంత్
గురువారం తన అభిమానులకు మరో
ట్రీట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే
కబాలి టీజర్, ఆడియోను విడుదల
చేసిన చిత్ర బృందం గురువారం
సాయంత్రం 8 గంటలకు ఈ చిత్రంలోని
ఓ పాట టీజర్ను విడుదల చేయనుంది.
ఈ విషయాన్ని ‘కబాలి’ చిత్ర బృందం
సోషల్మీడియా ద్వారా వెల్లడించింది.
ఇది కచ్చితంగా తలైవా అభిమానులకు
ఓ ట్రీట్ అవుతుందని పేర్కొంది.
ఈ చిత్రంలో రజినీకాంత్ భార్య
పాత్రలో రాధికా ఆప్టే నటించారు.
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను
నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
త్వరలో ‘కబాలి’ ప్రేక్షకుల
ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్
యూట్యూబ్లో అత్యధిక హిట్స్తో
రికార్డు సృష్టించిన సంగతి
తెలిసిందే.

No comments:
Post a Comment