Thursday, 16 June 2016

తలైవా అభిమానులకు మరో ట్రీట్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గురువారం తన అభిమానులకు మరో ట్రీట్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికే కబాలి టీజర్‌, ఆడియోను విడుదల చేసిన చిత్ర బృందం గురువారం సాయంత్రం 8 గంటలకు ఈ చిత్రంలోని ఓ పాట టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ‘కబాలి’ చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఇది కచ్చితంగా తలైవా అభిమానులకు ఓ ట్రీట్‌ అవుతుందని పేర్కొంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌ భార్య పాత్రలో రాధికా ఆప్టే నటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో అత్యధిక హిట్స్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment