Saturday, 11 June 2016

‘జనతా గ్యారేజ్‌’ సెట్‌లో నితిన్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం సెట్‌లో హీరో నితిన్‌ సందడి చేశారు. శుక్రవారం ఈ చిత్రం సెట్‌కు వెళ్లినట్లు నితిన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. చాలా కాలం తరువాత తారక్‌ను కలిశానని, ఆయన డ్యాన్స్‌ చూడటం ఓ ట్రీట్‌లా ఉందని ట్వీట్‌ చేశారు. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

No comments:

Post a Comment