హైదరాబాద్:
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న
‘జనతా గ్యారేజ్’ చిత్రం సెట్లో
హీరో నితిన్ సందడి చేశారు.
శుక్రవారం ఈ చిత్రం సెట్కు
వెళ్లినట్లు నితిన్ తన ట్విట్టర్
ఖాతా ద్వారా తెలిపారు. చాలా
కాలం తరువాత తారక్ను కలిశానని,
ఆయన డ్యాన్స్ చూడటం ఓ ట్రీట్లా
ఉందని ట్వీట్ చేశారు. ‘జనతా
గ్యారేజ్’ చిత్రంలో సమంత, నిత్యా
మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్
సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ
ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం
సమకూరుస్తున్నారు.

No comments:
Post a Comment