Friday, 10 June 2016

అతడు కాదు ఆమె...

                తొలుత ఎగతాళి చేసినవారే నేడు చప్పట్లు కొడుతున్నారు 
ఒరేగాన్: అమెరికా ఒరేగాన్‌కు చెందిన 39 ఏళ్ల రోజ్ గెయిల్‌ అనే మహిళకు 13వ ఏట నుంచే అవాంఛిత రోమాలు ఒంటి నిండా రాసాగాయి. దీంతో ఆమె కంగారు పడి రేజర్‌తో షేవింగ్ చేసుకునేది. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే షేవింగ్ చేసుకోకపోతే మరుసటి రోజుకు మీసం, గడ్డం కనిపించేది. అంతా ఎగతాళి చేసేవారు. దీంతో ఆమె చాలా ఒత్తిడికి గురైంది. దాదాపు పన్నెండేళ్ల వరకు రోజ్‌ జీవితం సాధారణంగానే గడిచింది. అయితే 12 ఏళ్ల తర్వాత ఒకరోజు అద్దం ముందు నిల్చుంటే తెలిసింది తనకు మీసం, గెడ్డం పెరుగుతోందని. వెంటనే ఎవరికీ చెప్పకుండా రేజర్‌తో క్లీన్‌ షేవింగ్‌ చేసుకుంది. రోజూ ఉదయం లేవగానే అలా షేవింగ్‌ చేసుకునే బయటకు వెళ్లేది. అలా రోజూ షేవింగ్‌ చేసుకుంటూనే పీజీ కూడా పూర్తి చేసింది. దాదాపు 26 సంవత్సరాల పాటు ఆమె రోజూ షేవింగ్‌ చేసేది. అయితే ఓ రోజు షేవింగ్‌ చేసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చేయడంతో తల్లికి తెలిసిపోయింది. ఆమె మొదట కంగారు పడినా తర్వాత కూతురికి సపోర్ట్‌ చేసింది. ఇటీవల వాటిని పూర్తిగా నిరోధించుకోవడం కోసం లేజర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లింది. ఆ చికిత్స పూర్తయిన రెండు నెలల వరకు బాగానే ఉన్న పరిస్థితి చివరకు మళ్లీ మొదటికొచ్చింది. దీంతో చేసేది లేక గడ్డంతోనే బయటకు వస్తోంది.  తల్లిదండ్రుల సహకారంతో డాక్టర్లను ఆశ్రయించి నానా మందులు మింగింది. ఆమె జీన్స్, పాలికిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో కలిసి అనూహ్యమైన హార్మోన్ అభివృద్ధికి దారి తీసిందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె తొలుత ఆత్మన్యూనతకు గురైనా ఆ తర్వాత క్రమంగా దాన్నుంచి బయటపడ్డారు. గడ్డం, మీసాలు పెంచడం ప్రారంభించారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నారు. దీంతో ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. క్రమంగా ఆమెకు ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఫాలోయర్స్ పెరిగారు. రోజ్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెప్పడం ప్రారంభించారు. పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ కూడా చేస్తున్నారు.

No comments:

Post a Comment