Friday, 24 June 2016

‘బ్రెగ్జిట్‌’తో బంగారం పరుగులు..

బ్రెగ్జిట్‌ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. పసిడి నేడు రెండేళ్ల గరిష్ఠానికి పెరిగింది. 26 నెలల్లో అత్యధికంగా ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.30,885కు చేరింది. 2013 ఆగస్టు తర్వాత ఒక్క రోజులో బంగారం ధర ఇంతగా పెరిగింది ఈరోజే. అలాగే 2014 ఏప్రిల్‌ 28న పది గ్రాముల బంగారం ధర రూ.30,730కు చేరిన తర్వాత మళ్లీ ఈరోజు అధికంగా రూ.30,885కు చేరింది. ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.
వెండి ధర కూడా కేజీకి రూ.1000 పెరిగి రూ.42,300 అయ్యింది. బ్రెగ్జిట్‌ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.21 పైసలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. లండన్‌లో 8.1 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,354.54 డాలర్లకు చేరింది.

No comments:

Post a Comment