చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. ఆయన మరణించినప్పటికి అతని వయస్సు 256 ఏళ్లట. అన్నేళ్లు బతకడం చరిత్రలోనే తొలిసారి జరిగిన సంఘటన. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ల వయస్సులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ.. అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయుర్వేద వైద్యుడిగా అనేక చోట్ల కాలం వెళ్లదీసి 72ఏళ్ల వయస్సులో కై క్సియన్ ప్రాంతానికి చేరుకున్నాడు. 1749లో ఆర్మీలో చేరి మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా.. సలహాదారుగా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1927లో లీ చింగ్ను తిరిగి ఆయన స్వస్థలానికి పిలిపించారు.
అప్పటికీ ఆయనకు 24మంది భార్యలు.. 500పైగా పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబంలో 11 తరాలను చూశాడు. చివరికి 1933లో మరణించాడట. అయితే ఆయన వయస్సుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్ తాను 1736లో జన్మించాడని స్వయంగా చెప్పాడట. అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677లో జన్మించాడని అంటున్నారు. 1930లో ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన కథనం ప్రకారం చైనా ప్రభుత్వం రికార్డుల్లో 1827లో లీ చింగ్కు 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. 1877లో 200వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు.
రెండు కథనాల ప్రకారం లీ చింగ్ 197ఏళ్లు లేదా 256ఏళ్లు జీవించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వందల ఏళ్లు జీవించడం అనేది ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పాలి.
ఇప్పటి వరకు ఫ్రెంచ్కి చెందిన ఓ మహిళ 122 ఏళ్లు జీవించి అత్యధిక వయస్సున్న మనిషిగా రికార్డు సాధించింది. ఆమె కంటే ఆ చైనీయుడు రెండింతలకు పైగానే బతికాడన్నమాట.

No comments:
Post a Comment