పెండింగ్ జరిమానాల
వసూలుకు ట్రాఫిక్పోలీస్ విభాగం లోక్అదాలత్ నిర్వహిస్తోంది. గోషామహల్
పోలీస్ స్టేడియంలో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అదాలత్లో
పెనాల్టీ సొమ్ములో సగం చెల్లించి కేసుల నుంచి బయటపడే అవకాశం కల్పించనుంది.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసులు కఠిన వైఖరి
అవలంబిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఉల్లంఘనలను
పాయింట్లు ద్వారా లెక్కించనున్నారు. వాటి ఆధారంగా లైసెన్స్ రద్దు
చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్
కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్,
రాంగ్పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ వేలాదిమంది
సీసీకెమెరాలకు చిక్కుతున్నారు. ఇలా పట్టుబడిన వందలమందికి ప్రతిరోజూ
ఈ-చలానాలు పంపుతున్నారు. వాహనాల క్రయ, విక్రయాల్లో పెండింగ్ చలానాలు చాలా
కీలకం. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణాశాఖ విభాగంలో ఎన్వోసీ
సర్టిఫికెట్ సమర్పించాల్సిందే. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పెండింగ్
పెనాల్టీ చెల్లించేందుకు ఇది మంచి అవకాశమని ట్రాఫిక్ ఏసీపీ ఎ.వి.రంగనాథ్
అన్నారు. పెద్ద మొత్తంలో బకాయి లుంటే రూ.1000 చెల్లిస్తే చాలని వివరించారు.

No comments:
Post a Comment