Sunday, 25 September 2016

నా పెళ్లి చేసినోళ్లకు కృతజ్ఞతలు!

ఉయ్యాల జంపాలతో వెండితెరకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ను లాస్య రహస్య వివాహం చేసుకుందని వస్తున్న పుకార్లు తెలిసిందే. అయితే.. దీనిపై ఆ యువకథానాయకుడు స్పందించాడు. ‘నా పెళ్లి చేసిన మిత్రులందరికీ కృతజజ్ఞతలు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అతడు ట్విట్టర్ వేదిక లాస్యతో పెళ్లి పుకారు గురించి పెదవి విప్పాడు. తాను లాస్యను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. కుమారి 21ఎఫ్ సినిమా ఆడియో వేడుకలో మాత్రమే ఆమెను కలిశానని వెల్లడించాడు. ‘‘నా సంబంధం, నా ప్రమేయం లేకుండా కుమారి 21ఎఫ్ సినిమా ఆడియో వేడుకలో ఒకే ఒక్కసారి కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మిత్రులకు నా కృతజజ్ఞతలు’’ అని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చాడు రాజ్‌తరుణ్. ‘‘ఇలాంటి వింత, విచిత్రమైన హాస్యాస్పద పుకార్లకు ఎలా స్పందించాలో నాకు తెలియట్లేదు. మరో మూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకోను. ఇప్పటికైతే నాకు పెళ్లి ఆలోచనే లేదు. అంతకుమించి లేచిపోవాల్సిన అవసరమూ నాకు లేదు. నా పెళ్లి అయినప్పుడు అందరికీ నేనే చెబుతాను’’ అంటూ ట్వీట్ చేశాడు. మరి అతడి ట్వీట్‌తో ఈ పుకారుకు తెరపడినట్టే.

No comments:

Post a Comment