Monday, 19 September 2016

దసరా తర్వాతే త్రైమాసిక పరీక్షలు...

-అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3
              దసరా పం డు గ తర్వాత త్రైమాసిక పరీక్షలు నిర్వహిం చేం దుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యా శాఖ వర్గాలు ఈ మేరకు షెడ్యూ ల్‌ను సైతం ఖరారు చేశారు. దసరాతర్వాతే పరీక్షలు నిర్వ హించడం పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే అరు దుగా చెప్పవచ్చు. వాస్తవికంగా సెప్టెంబర్ మా సంలో పరీక్షలు నిర్వహించి, దసరా సెలవులి వ్వడం అనవాయితీగా వస్తోంది. కాని ఈ సారి షెడ్యూల్‌లో మార్పులు చేసి సెలవుల తర్వాతే పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించేం దుకు విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గల విద్యా ర్థులకు షెడ్యూల్ ప్రకారం త్రైమాసిక పరీక్షలను నిర్వ హిస్తామని డీఈఓ ఎం. సోమిరెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు. 27-9-16 మొదటి పరీక్ష , 28-9-16 రెండో పరీక్ష ,29-9-16 మూడో పరీక్ష ,31-9-16 నాలుగో పరీక్ష,1-10- 16 ఐదో పరీక్ష ,2-10-16 ఆరవ పరీక్ష ,3-10-16 ఏడో పరీక్ష

No comments:

Post a Comment