-కొత్త జిల్లాలపై సన్నాహాలు ముమ్మరం
-పూర్తి కావచ్చిన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎంపిక
-యాదాద్రి, సూర్యాపేటలో భవనాలు పరిశీలించిన సీఎస్
-జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్షలు
కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. వర్క్టు సర్వ్ కింద తాత్కాలికంగా కేటాయింపులు జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఈ మేరకు కసరత్తు పూర్తిచేయటంతోపాటు ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చాయి. కేటాయింపులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటమే మిగిలింది. కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ మరో 22 రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన ఏర్పాట్లు కూడా వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు, నివాసాలకు కూడా భవనాల ఎంపిక పూర్తయింది. వాటికి అద్దెలు నిర్ణయించాల్సి ఉంది. ఇక డ్రాప్ట్ నోటిఫికేషన్లో ప్రజల అభ్యంతరాలు, సలహాలకోసం ఇచ్చిన వ్యవధి మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటిదాకా 70వేల అభ్యంతరాలు, వినతులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో రాజకీయ స్వభావం కలిగినవే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజల కోరిక మేరకు అదనంగా 70 మండలాల ఏర్పాటుతో పాటు మరిన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రజలనుంచి వచ్చే విజ్ఞప్తులతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెప్పించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-పూర్తి కావచ్చిన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎంపిక
-యాదాద్రి, సూర్యాపేటలో భవనాలు పరిశీలించిన సీఎస్
-జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్షలు
కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. వర్క్టు సర్వ్ కింద తాత్కాలికంగా కేటాయింపులు జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఈ మేరకు కసరత్తు పూర్తిచేయటంతోపాటు ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చాయి. కేటాయింపులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటమే మిగిలింది. కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ మరో 22 రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన ఏర్పాట్లు కూడా వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు, నివాసాలకు కూడా భవనాల ఎంపిక పూర్తయింది. వాటికి అద్దెలు నిర్ణయించాల్సి ఉంది. ఇక డ్రాప్ట్ నోటిఫికేషన్లో ప్రజల అభ్యంతరాలు, సలహాలకోసం ఇచ్చిన వ్యవధి మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటిదాకా 70వేల అభ్యంతరాలు, వినతులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో రాజకీయ స్వభావం కలిగినవే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజల కోరిక మేరకు అదనంగా 70 మండలాల ఏర్పాటుతో పాటు మరిన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రజలనుంచి వచ్చే విజ్ఞప్తులతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెప్పించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

No comments:
Post a Comment