Sunday, 25 September 2016

వరంగల్‌లో దెయ్యం చేప...

వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలోగల రంగసముద్రం చెరువు మత్తడి వద్ద చేపల వేటకు వెళ్లిన శనివారం స్థానికులకు అరుదైన చేప లభ్యమైంది. ఆ చేపను చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ చేప శరీరమంతా మచ్చలు, ముళ్లు కలిగి వింత ఆకారంలో ఉంది. చేప ఏడువందల యాభై గ్రాముల బరువు ఉంది. ఈ చేపను మత్య్సకారులు దెయ్యం చేపగా పిలుస్తారని వారు చెబుతున్నారు. అధికారులు దానిని సక్కర్‌ ఫిష్‌ జాతికి చెందిన విషపు చేప అంటున్నారు. ఆ చేప నీటిలో ఉన్న చిన్నచేపలను తింటుందని వారు తెలిపారు. నక్కర్ జాతికి చెందిన చేపను తినకూడదని, తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment