Monday, 1 August 2016

ప్రో కబడ్డీ సీజన్‌-4 విజేత పట్నా

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ ప్రో కబడ్డీ నాలుగో సీజన్‌ టైటిల్‌ను గెలుచుకుంది. జైపూర్‌ పింక్‌ఫాంథర్స్‌తో హైదరాబాద్‌ గచ్చిబౌలీలోని ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 37-29 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 19-16 పాయింట్ల స్వల్ప తేడాతో మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్‌ జట్టులో డిఫెండర్స్‌ వైఫల్యాన్ని సొమ్ముచేసుకుంటూ పట్నా రైడర్స్‌ పాయింట్లు సాధించారు. పట్నాపైరేట్స్‌ జట్టు కీలక ఆటగాడు ప్రదీప్‌ నర్వాల్‌ 16 రైడింగ్స్‌ పాయింట్లు సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో మొత్తం 115 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. తెలుగుటైటాన్స్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి అగ్రస్థానంలో ఉన్నాడు. మ్యాచ్‌ తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌, నటి పూజాహెగ్డే తదితరలు హాజరయ్యారు.

No comments:

Post a Comment