దేశంలో
మొదటిసారి భారీ స్థాయిలో బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమైంది. అతి పెద్ద
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోకి
భారతీయ మహిళా బ్యాంకు సహా మొత్తం ఆరు బ్యాంకులు విలీనం కానున్నాయి.
ఇందుకు ఎస్బీఐ అంగీకారం తెలిపింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్
ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, భారతీయ మహిళా
బ్యాంకులు ఎస్బీఐలో విలీనం కానున్నాయి.

No comments:
Post a Comment