లీకేజీ రాష్ట్రానికి మైనస్సే!
- అయినా ఇబ్బంది లేదు.. దోషులను పట్టాం
- ఇక జాగ్రత్తగా ఉండేందుకు దోహదం
- సమీక్షలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- లీకు ర్యాంకర్లకు ఎంసెట్-3లో నో చాన్స్!
- మంత్రులను బర్తరఫ్ చేయాలి
- గళమెత్తిన విద్యార్థి సంఘాలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- నల్లగొండలో పిల్లలపై లాఠీచార్జి
- లీకేజీలో కేటీఆర్ హస్తం: షబ్బీర్
ఎంసెట్-2 లీకేజీ ఘటన రాష్ట్రానికి మైనస్సేనని ముఖ్యమంత్రి కేసీఆర్
వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయినా ఇబ్బంది లేదని, భవిష్యత్తులో
జాగ్రత్తగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఎంసెట్-2 పేపర్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో
సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు
చేసినట్లు తెలిసింది. పేపర్ లీక్ ఘటనపై ధైర్యంగా స్పందించామని, ఎలాంటి
సంకోచం లేకుండా సీఐడీ విచారణకు ఆదేశించామని చెప్పారు. లీక్కు బాధ్యులైన
వారిని పట్టుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నట్లు తెలిసింది. ఈ
ఘటన మంచికే జరిగిందని కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
భవిష్యతలో జాగ్రత్తగా ఉండేందుకు ఈ ఘటన తోడ్పడుతుందని, ఇకపై ప్రతి సెట్
నిర్వహణ, పోటీ పరీక్ష నిర్వహణలోనూ జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం
స్పష్టం చేశారు.
No comments:
Post a Comment