శ్రీకృష్ణుడు అనగానే..
తెలుగు ప్రజలకు గుర్తొచ్చే పేరు నందమూరి తారకరామరావు. అనేక చిత్రాల్లో
ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించినప్పటికీ.. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఆహార్యం,
అభియం అజరామరం. కాబట్టే.. తెలుగు ప్రజలు తమ గుండెల్లో ఆయన కృష్ణుడిగా
ముద్రించుకున్నారు. అయితే, ఎన్టీఆర్ వెండితెరపై కృష్ణుడిగా ప్రయాణం
చేయడానికి చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చిందట. మొట్టమొదట ఎన్టీఆర్ కృష్ణుడిగా
నటించిన చిత్రం 1956లో వచ్చిన ‘సొంత ఊరు’. ఈ చిత్రం పరాజయం పాలైంది. ఈ
చిత్రం తరువాత.. విజయా వారి బ్యానర్లో వచ్చిన మాయబజార్ చిత్రంలో ఎన్టీఆర్
కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే, ఈ పాత్ర పోషించడానికి ఆయనకు చాలా
ఇబ్బందులే ఎదురయ్యాయి. ఈ సినిమా దర్శకుడైన కేవీ రెడ్డీ ఈ పాత్రకు
ఎన్టీఆర్నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. విజయా బ్యానర్కు చెందిన
ప్రముఖుల సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ‘సొంత ఊరు’
పరాజయం పాలైందని, ఈ సినిమా కూడా పరాజయం పాలవుతుందని, అనుమానాలు వ్యక్తం
చేయడమే కాకుండా వద్దని పట్టుబట్టారట. కానీ, కేవీ రెడ్డి మాత్రం సినిమా కథపై
ఉన్న నమ్మకంతో ఎన్టీఆరే కావాలని అడిగాడట. దీంతో ఆలోచించిన చిత్ర నిర్మాతలు
నాగిరెడ్డి, చక్రపాణిలు.. సొంత ఊరులో పరాజయం పాలైనప్పటికీ శ్రీకృష్ణుడిగా
ఎన్టీఆర్ మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడని భావించి కేవీరెడ్డి
మద్దతు పలికారట. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలిసిందే. ఇక
అప్పటి నుంచి కృష్ణుడిగా ఎన్టీఆర్ జైత్రయాత్ర గురించి తెలుగు ప్రేక్షకులకు
వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ ‘విజయ’ సన్నిహితులకు కేవీ రెడ్డి, నాగిరెడ్డి
మద్దతు పలికి ఉంటే.. ఎన్టీఆర్ని మనం ఇలా చూసే వాళ్లం కాదేమో.

No comments:
Post a Comment