ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ
బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్రదినోత్సవ
సందర్భంగా తమ వినియోగదారుల
కోసం కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది.
ప్రతి ఆదివారం ల్యాండ్లైన్
నుంచి దేశంలోని ఏ నెట్వర్క్
ల్యాండ్లైన్ లేదా మొబైల్
ఫోన్కు అపరిమిత కాల్స్ చేసుకునే
సదుపాయం కల్పిస్తున్నట్లు
టెలికాంశాఖ మంత్రి మనోజ్ సిన్హా
వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ సంస్థ మరో ఆఫర్ను
ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం(ఆగస్టు
15న) సందర్భంగా ల్యాండ్లైన్
నుంచి ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్
లేదా మొబైల్ ఫోన్కు అపరిమితంగా
మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు
తెలిపింది. ప్రైవేటు సంస్థల
నుంచి పోటీని తట్టుకునేందుకు
ఇప్పటికే రాత్రి 9 నుంచి 7 గంటల
వరకు ల్యాండ్లైన్ నుంచి ఏ
నెట్వర్క్ ల్యాండ్లైన్
లేదా మొబైల్కు అపరిమితంగా
మాట్లాడుకునే సౌకర్యాన్ని
బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

No comments:
Post a Comment