Friday, 19 August 2016

దేవతలే దిగివస్తే..

కృష్టమ్మ పుష్కరాలంటే ముక్కోటి దేవతలు.. ముగ్గురు మూర్తులు.. అందరికీ వేడుకే. అందుకే దీవెనలు అందించేందుకు ఆ దేవతలంతా తరలొచ్చి కృష్ణమ్మ చెంత కొలువుదీరారు. ఆ దివ్య జలాల్లో మూడు మునకలు వేసి తరించే భక్తకోటిని దీవించేందుకు శ్రీశైల మల్లికార్జునుడు, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, బిక్కవోలు సుబ్రహ్మమణ్యేశ్వరుడు, శ్రీకూర్మం శ్రీకూర్మనాథేశ్వరుడు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, రామతీర్థం రామనాధస్వామి, చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి, కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమూనా ఆలయాలతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాల ప్రాంగణం భక్తులను విశేషంగా అలరిస్తోంది.

No comments:

Post a Comment