Thursday, 19 May 2016

పశ్చిమ్‌బంగ: దీదీకి తిరుగులేదు!

కోల్‌కతా: పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దూసుకెళ్తొంది. పశ్చిమ్‌ బంగలో మొత్తం 294 స్థానాలు ఉండగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 74 స్థానాల్లో విజయం సాధించగా, 139 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్‌ ఫ్రంట్‌ 4 స్థానాల్లో విజయం సాధించగా 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ 12 స్థానాల్లో విజయం సాధించగా 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 2 స్థానాల్లో విజయం సాధించగా, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

No comments:

Post a Comment