దేశంలో మొట్ట మొదటిసారిగా 12వేల అడుగు ఎత్తులో సంచరిస్తున్న పులిని
అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్లోని ఎగువ ప్రాంతమైన పితోర్గఢ్లో
అత్యంత ఎత్తులో తిరుగుతున్న పులి ఆనవాళ్లను ఓ కెమెరా రికార్డు చేసింది.
సాధారణంగా ఇంత ఎత్తులో మంచు పులులు మాత్రమే సంచరిస్తుంటాయి. వైల్డ్ లైఫ్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్.. జీవవైవిధ్య
పరిరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఫొటోలు తీస్తుండగా ఇండియాలోని ఎత్తైన
ప్రదేశంలో ఈ పులి ఆనవాళ్లు చిక్కాయి. ఎత్తైన ప్రదేశాల్లో పులులు కనిపించడం
గురించి బ్రిటిష్ కాలం నాటి పుస్తకాల్లో ఉందని, అయితే ఇందుకు సంబంధించిన
శాస్త్రీయ ఆధారాలు కానీ, ఫోటోలు కానీ లేవని బిలాల్ పేర్కొన్నారు.
భూటాన్లో మాత్రం 13వేల అడుగుల ఎత్తుల పులులు సంచరించినట్టు ఆధారాలు
ఉన్నాయని ఆయన వివరించారు.
ఉత్తరాఖండ్లోని
ఎత్తైన ప్రాంతాల్లో మూడు వేల నుంచి నాలుగు వేల అడుగుల ఎత్తులో పులుల
సంచారాన్ని గుర్తించామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్
ఫారెస్ట్స్(వైల్డ్ లైఫ్) డీవీఎస్ ఖటి పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో
12 అడుగులో పులి ఉన్న దృశ్యాలను కెమెరా బంధించినట్టు వివరించారు. ప్రస్తుతం
పులిని గుర్తించిన ప్రాంతం నేపాల్కు అత్యంత చేరువలో ఉందని, వేటగాళ్లు
ఎక్కువగా తిరుగాడే ప్రాంతం కావడంతో ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు
వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. నేపాల్తోపాటు రాష్ట్ర పోలీసులు,
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సీమా సురక్షా బల్ బలగాల సహకారంతో అక్కడ
నివసిస్తున్న పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఖటి తెలిపారు.

No comments:
Post a Comment