Friday, 29 July 2016

అక్కడ భర్తల్ని రాచిరంపాన పెడతారట!

కైరో: మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో ఎక్కువగా భార్యను రాచిరంపాన పెట్టే భర్తలనే చూస్తుంటాం. కానీ ఈజిప్ట్‌లో మాత్రం పరిస్థితి అందుకు రివర్స్‌లో ఉంటుంది. అక్కడి ఆడవాళ్లు భర్తల్ని చితకబాదేస్తారట. ఈజిప్ట్‌లోని ఫ్యామిలీ న్యాయస్థానం తాజాగా విడుదల చేసిన నివేదికలో 28 శాతం మహిళలు భర్తల్ని ఉతికి ఆరేస్తారని వెల్లడైంది.
అదీకాకుండా ఈ ఏడాదిలోనే ఈజిప్ట్‌కి చెందిన 66 శాతం దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అక్కడ భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు భార్యలను తిరిగి కొట్టలేని పరిస్థితి. వారిని ఒక్కమాట అన్నా.. తిరిగి చేయిచేసుకున్నా తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్కడి చట్టాలు మహిళలకు ఆ రక్షణ కల్పించాయి. కాబట్టి భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు వారిపై కేసు పెట్టడం తప్ప ఇంకేం చేయడానికి లేదు. తాజాగా వెల్లడైన నివేదికలో ఇలాంటి కేసులు దాదాపు 6,000వరకు నమోదయ్యాయి.
కొందరు మహిళలు వారి భర్తల్ని ఏకంగా బెల్టులతోనూ బాదేస్తారట. ఒక్కోసారి వారు తినే తిండిలో నిద్రమాత్రలు కూడా కలుపుతుంటారట. ప్రపంచంలో భర్తల్ని హింసపెట్టే మహిళలుగా ఈజిప్ట్‌ స్త్రీలే మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో అమెరికా(23 శాతం), యూకే(17 శాతం), భారత్‌(11 శాతం)దేశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment