Saturday, 30 July 2016

రైల్వేస్టేషన్లో వైఫై యూజర్లు@ 20లక్షలు

దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో హై స్పీడ్‌ వైఫై సర్వీసులను దాదాపు 20 లక్షల మంది వినియోగించు కుంటున్నారని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ తన ప్రాజెక్టులో భాగంగా భారత్‌లోని పలు రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయాన్ని అందిస్తోంది.
భారత రైల్వే, రైల్‌ టెల్‌తో కలిసి గూగుల్‌ సంస్థ రైల్వేస్టేషన్లలో హైస్పీడ్‌ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తోందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రతి నెలా 2 మిలియన్ల ప్రజలు ఈ వైఫై సేవల కోసం లాగిన్‌ అవుతున్నారని.. వారి సొంత నెట్‌వర్క్‌ల కంటే 15 రెట్ల డేటాను వినియోగిస్తున్నారని వెల్లడించారు. ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. ముంబయి సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభించిన తొలి వారంలోనే లక్ష మంది యూజర్లు లాగిన్‌ అయినట్లు చెప్పారు.

No comments:

Post a Comment