Sunday, 31 July 2016

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ‘గుండె’

బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చిరంజీవి (43)పది రోజులుగా జ్వరం రావడంతో తిరుపతి స్విమ్స్‌లో ఆయనకు వైద్యం చేయించారు. అప్పటికే బ్రెయిన్‌లోని నరాలు దెబ్బతినడంతో రోజులు గడుస్తున్న కొద్ది చిరంజీవి గుండె బ్రెయిన్‌డెడ్ అయిపోయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆర్గానిక్ డొనేషన్‌కు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతి నుంచి గుండెను హైదరాబాద్‌కు తరలించారు. గ్రీన్‌చానల్ ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా స్టార్‌ ఆస్పత్రికి కేవలం 20 నిమిషాల్లో తరలించారు.

No comments:

Post a Comment