Friday, 29 July 2016

భారత్‌ × వెస్టిండీస్‌ టీ20 అమెరికాలో..?

వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ముగిసిన అనంతరం భారత్‌ జట్టు ఓ టీ20 సిరీస్‌ను కూడా కరీబియన్లతో ఆడనున్నట్లు సమాచారం. టెస్టు సిరీస్‌ ఆగస్టు 22న ముగియనుండగా.. అనంతరం ఇదే నెల చివరి వారంలో ఈ టీ20 సిరీస్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా మ్యాచ్‌ల నిర్వహణపై అక్కడి స్టేడియం మేనేజర్‌తో అధికారకంగా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టెస్టు జట్టులోని 15 మంది సభ్యుల్లో 8 మంది టీ20 ఆటగాళ్లు కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అమెరికాలో టీ20 సిరీస్‌ నిర్వహణపై ఐసీసీ అనుమతి కోసం సంప్రదింపులు జరుపుతున్న వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అనుమతిరాగానే అధికారిక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment