బీరుట్:
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోమారు దారుణ మారణకాండకు తెగబడ్డారు.
ఉత్తర సిరియాలోని ఓ గ్రామాన్ని సీజ్ చేసిన ఉగ్రవాదులు గంటకొకరిని చొప్పున
24 గంటల్లో 24 మందిని ఊచకోత కోశారు. టర్కీ బోర్డర్, ఐఎస్ డి ఫేక్టో రాజధాని
రఖ్ఖా పట్టణం మధ్యలో మన్బిజ్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని
దిగ్బంధించిన ఉగ్రవాదులు దొరికిని వారిని దొరికినట్టు చంపేశారు. గురువారం
ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఉగ్రవాదులు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గత ఐదేళ్లుగా సిరియాలో జరుగుతున్న
సంఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 2.80 లక్షల మంది మృతి చెందగా లక్షలాది మంది
తరలిపోయారు.

No comments:
Post a Comment