Saturday, 30 July 2016

ఎంబీఏ, ఎంసీఏ కనిష్ఠ ఫీజు రూ.27వేలు

             ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ట్యూషన్‌ ఫీజులపై ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలో 349 కాలేజీలు ఎంబీఏను, 132 కాలేజీలు ఎంసీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి. మొత్తం 481 కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌కి సంబంధించిన ట్యూషన్‌ ఫీజులను నిర్ధారించేందుకు ఏఎ్‌ఫఆర్‌సీ సుదీర్ఘ కసరత్తు చేసింది. అనంతరం వాటిని ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ట్యూషన్‌ ఫీజులు తేలాయి. ఎంబీఏ కోర్సుకు గరిష్ఠ ఫీజు రూ. 68 వేలుగా, ఎంసీఏ గరిష్ట ఫీజు రూ.60,500 వేలుగా ఖరారయ్యాయి. ఈ రెండు కోర్సులకు కనిష్ఠ ఫీజు మాత్రం రూ.27 వేలుగా నిర్ధారించారు. దీంతో పాటు 2 ఎంబీఏ కాలేజీలు, 13 ఎంసీఏ కాలేజీలు మూసివేతకు ఏఎ్‌ఫఆర్‌సీ ప్రతిపాదించగా.. వాటికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా ఉత్తర్వులిచ్చారు.

No comments:

Post a Comment