Saturday, 30 July 2016

ఎంసెట్‌-3 షెడ్యూల్‌పై కసరత్తు షురూ!

సర్కారు మౌఖిక ఆదేశాలు
  ఆగస్టు చివరి వారంలో పరీక్ష,
సెప్టెంబరు తొలి వారంలో ఫలితాలు?
            ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించిన నేపథ్యంలో ఎంసెట్‌-3 నిర్వహణ షెడ్యూల్‌పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఒకవేళ పరీక్ష నిర్వహించాల్సి వస్తే ముందస్తుగానే సిద్ధం కావాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఎంసెట్‌ 1, 2లు రద్దుచేస్తే...                  కేవలం ఎంసెట్‌-2ను రద్దుచేస్తే మళ్లీ ప్రకటన జారీచేసే అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎంసెట్‌-1ను కూడా రద్దుచేస్తే మాత్రం మళ్లీ తాజాగా ప్రకటన జారీచేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఫలితాల విడుదలకు దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. అందువల్ల ఆగస్టు చివరి వారంలో పరీక్ష నిర్వహించి, సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని తాత్సాలిక షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంసెట్‌-3కి కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. ఎంసెట్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉన్నందున రిజిస్ట్రార్‌ యాదయ్య పేరును ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఆయన కొన్నేళ్లుగా ఈసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంసెట్‌-3 పరీక్షను వేగంగా పూర్తిచేసేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment