Saturday, 30 July 2016

ఆమెకు బలవంతంగా యూరిన్ తాగించారు

దర్భంగా: దేశ వ్యాస్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈ సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. బీహార్‌లో ఓ మహిళ మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తన యూరిన్‌ని తనకే తాగిపించారు ఓనలుగురు వ్యక్తులు. బీహార్‌లోని దర్భంగా జిల్లా పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది ఈ సంఘటన. ఈ సంఘటనపై  తమ గ్రామంలోని పిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని, దానికి ఆ దళిత మహిళే కారణం అని వారు ఆరోపించినట్లు స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్ తెలిపారు. ఆ కారణం చేతనే గురువారం ఆ దళిత మహిళకు బలవంతంగా యూరిన్‌ని తాగించారని పేర్కొన్నారు. ఈ చర్యకు కారకులైన వారపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని తెలిపారు.
స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్ తెలిపారు. 

No comments:

Post a Comment