Monday, 25 July 2016

ఈ సంఘటన గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు !

క్షణికావేశంలో తప్పుచేసే యువత ఇది చూసైనా మారతారా ?

ఉత్తరప్రదేశ్: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు. అడ్డుగా ఉందని తొలగించుకుందో, క్షణికావేశంలో చేసిన తప్పుకు బిడ్డను బలిచేసిందో తెలియదు. ఆగి ఉన్న రైలు బోగీలోని టాయ్‌లెట్ రూమ్ ఆ పసికందుకు జన్మస్థానమైంది. దుర్వాసన భరించలేక ఆ పసిప్రాణం విలవిలలాడింది. వెక్కివెక్కి ఏడ్చింది. గుక్కపట్టి కన్నీళ్లు కార్చిన ఆ పసికందు ఊపిరి కొద్దిసేపటికి గాల్లో కలిసిపోయింది. రైలు బోగీల్లో టాయ్‌లెట్ క్లీన్ చేయడానికి వచ్చిన అటెండెంట్ లోపల పాప కనిపించడం చూసి చలించిపోయాడు. వెంటనే స్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు.
 
స్టేషన్ మాస్టర్ వచ్చి చూసే సమయానికే ఆ పాపకు ఈ ప్రపంచం తుది వీడ్కోలు పలికింది. ఈ మురికి సమాజంలో తాను బతకలేనంటూ ఆ పసిప్రాణం దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ ఘటన జరిగింది. ఉన- హిమాచల్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లో పక్కన నిలిపివేశారు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి తేజ్ ప్రతాప్ సింగ్ అనే అటెండెంట్ బోగీలోకి వెళ్లాడు. డోర్ తెరిచి చూడగానే పేగు రక్తం కూడా తడారని పసికందును చూసి షాకయ్యాడు. ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్న ఆ బిడ్డను గురించి స్టేషన్ మాస్టర్‌కు చెప్పాడు. స్టేషన్ మాస్టార్ వచ్చి బిడ్డకు ఊపిరి ఉందా లేదా చూశాడు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని తెలిసి తల్లడిల్లాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

No comments:

Post a Comment