Sunday, 31 July 2016

పారిస్‌లో వాటర్ ట్యాక్సీలు

పారిస్‌లో వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వినూత్న ప్రయోగం చేసింది. ప్రయాణికులు సరదాగా ప్రయాణించేలా సీన్‌ నదిలో ఫ్లైయింగ్‌ వాటర్‌ టాక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వాటర్‌ టాక్సీలో పైలట్‌తోపాటు ఐదుగురు ప్రయాణించవచ్చు. వాటర్ ట్యాక్సీ నడిపేందుకు డ్రైవర్‌ సహాయం లేకుండా రోబోతో పనిచేసే దిశగా పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 5 లక్షల యూరోలను కంపెనీ సేకరించింది. ఈ వాహనాలు బ్యాటరీలతో నడిచే విధంగా రూపొందించారు. గంటకు 29 మైళ్ల వేగంతో వాటర్ ట్యాక్సీలు వెళ్లగలవు.

No comments:

Post a Comment