Thursday, 28 July 2016

పదే పదే వేడి చేయొద్దు!

చాలామంది రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను మరుసటి రోజు వేడి చేసి తీసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే లేని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. అవేమిటంటే..
చికెన్‌ :- దీనిని చాలా మంది మళ్లీ వేడి చేసి తింటారు. అలా చేయడం వల్ల దానిలోని ప్రొటీన్లు పూర్తిగా నశించిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
బచ్చలికూర:- ఈ ఆకులో ఐరన్‌, నైట్రేట్లూ పుష్కలంగా లభిస్తాయి. ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో అప్పుడు ఇందులోని నైట్రేట్లు.. నైట్రిట్స్‌లా మారతాయి. వీటి ప్రతికూల ప్రభావం శరీరంలోని అవయ వాల మీద పడుతుంది. అందుకే.. బచ్చలి కూరను మళ్లీ వేడి చేసి ఆహారంలో తినకూడదు. ఒకవేళ వేడి కావాలనుకుంటే బాగా మరిగిన నీటిలో ఈ కూర గిన్నెను కొద్దిసేపు ఉంచి తీస్తే సరిపోతుంది.
గుడ్లు:- కోడిగుడ్లతో చేసిన వంటకాలనూ ఒకసారికి మించి వేడి చేయకూడదు. అలా చేస్తే దానిలోని పోషకాలు టాక్సిన్లుగా మారతాయి. జీర్ణవ్యవస్థ మీద చెడు ప్రభావం చూపిస్తాయి.
మష్రూమ్స్‌ :- ప్రొటీన్లు బాగా దొరికే ఆహారం మష్రూమ్స్‌. వీటినీ వండిన తర్వాత పదే పదే వేడి చేయటం మంచిది కాదు. అలా చేస్తే ప్రొటీన్లు విషపూరితంగా మారతాయి. అనారోగ్యాలు ఆవరిస్తాయి.
ఆలుగడ్డ :- ఆలుగడ్డ కూరను వేడి చేయడం వల్ల దానిలోని పోషక విలువ లన్నీ పోతాయి. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.ప

No comments:

Post a Comment