Saturday, 23 July 2016

రమ్య కారు ప్రమాద ప్రాంతంలో మరో ఘటన

పంజాగుట్టలో ఫ్లైఓవర్‌‌పై నుంచి కిందపడ్డ లారీ

నగరంలోని పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మరో ప్రమాదం తప్పింది. శనివారం ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి కింద పడిపోయింది. కాగా లారీ పడిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఇదే ఫ్లైఓవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఓకారు అదుపుతప్పి మరో కారుపై పడిన ఘటనలో చిన్నారి రమ్య సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment