Wednesday, 13 July 2016

రూ.30 కోసం మర్డర్‌ చేశాడు...

జైళ్లో ఊచలెక్కెడుతున్నాడు! 
ఔరంగాబాద్‌: కేవలం 30 రూపాయల కోసం కక్కుర్తి పడి ఆవేశంలో ఓ వ్యక్తిని చంపేశాడు గణేష్‌ రఘునాథ్‌ (20) అనే వ్యక్తి. పది రోజులపాటు ఎవరికీ తెలియకుండా ఆ శవాన్ని దాచేశాడు. కుటుంబ సభ్యులు కంప్లైంట్‌ ఇవ్వడంతో పోలీసులు కేసు ఛేదించి గణేష్‌ను అరెస్ట్‌ చేశారు. నాందేడ్‌ జిల్లాకు చెందిన గణేష్‌, ఔరంగబాద్‌లోని రామేశ్వర్‌ శ్రీరామ్‌ (75) అనే వ్యక్తి ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని జీతం గంటకు 20 రూపాయలు. ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకుని వెళ్లిపోతాడు. అయితే పది రోజుల క్రితం తాను గంటన్నర సమయం అదనంగా పనిచేశానని, తనకు 30 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని శ్రీరామ్‌కు చెప్పాడు గణేష్‌. ఆ డబ్బులు ఇవ్వడానికి శ్రీరామ్‌ నిరాకరించాడు.
 
ఎంతగా బతిమాలినా ఆ 30 రూపాయలు ఇచ్చేందుకు శ్రీరామ్‌ ఒప్పుకోలేదు. దీంతో ఆవేశపడిన గణేష్‌ పక్కనే ఉన్న ఇనుప పార తీసుకుని శ్రీరామ్‌ను హత్య చేశాడు. శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ ఫ్యాక్టరీలో ఉన్న క్లోజ్‌డ్‌ యూనిట్‌లో పడేశాడు. ఎంతకీ శ్రీరామ్‌ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ శవాన్ని కనుగొని గణేష్‌ను తమ స్టైల్లో ఇంటరాగేట్‌ చేయగానే వెంటనే నిజం ఒప్పేసుకున్నాడు. 30 రూపాయల కోసం తానే చంపానని అంగీకరించాడు. వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

No comments:

Post a Comment