Monday, 11 April 2016

కొల్లం విషాదం: 108కి చేరిన మృతులు

                  కేరళలోని కొల్లంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. తిరువనంతపురం కిమ్స్‌ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు సోమవారం మృతిచెందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అత్యంత విషాదంగా మారిన ఈ ఘటనలో నిన్న 106 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 300కి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
                  కేరళలోని కొల్లంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. తిరువనంతపురం కిమ్స్‌ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు సోమవారం మృతిచెందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అత్యంత విషాదంగా మారిన ఈ ఘటనలో నిన్న 106 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 300కి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

             కొల్లంలోని పుట్టింగల్‌ దేవి ఆలయంలో ఆదివారం భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా పోటీలు నిర్వహిస్తుండగా.. ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలో బాణసంచా పోటీలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి సహా, పలువురు అధికారులు తెలిపారు. మరోవైపు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని ఆలయ బోర్డు చెబుతోంది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు క్రైం బ్రాంచి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ కాంట్రాక్టర్‌ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

No comments:

Post a Comment