Thursday, 14 April 2016

సిటీ బస్సుల్లో ఉచిత వైఫై
హైదరాబాద్‌: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న పథకం చేపట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ప్రయాణికులకు తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించనున్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల బాడీల మార్పు దశల వారీగా చేపట్టనున్నట్లు ఈడీ తెలిపారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల బాడీలను మార్చనున్నట్లు తెలిపారు. 2015-16లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఆర్టీసీకి రూ.289 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆకట్టుకుని నష్టాల వూబి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment