కోహినూర్..
భారతీయులకు సంబంధించినంత వరకు ఇది చాలా విలువైనది. ఎంతో విలువైనదాని
గురించి సంబోధించేటపుడు దానిని కోహినూర్తో పోల్చడం మనకు అలవాటే. ఈ వజ్రం
గురించి ఎప్పట్నుంచో భారత్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది.
నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా కోహినూర్ను బ్రిటీష్ వారు
కొల్లగొట్టలేదు, దోచుకెళ్లలేదు. ఓ మహారాజు దానిని ఇంగ్లండ్ మహారాణికి
బహుమతిగా ఇచ్చేశాడు. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరులో
దొరికినట్టు కొంతమంది చెబుతున్నారు.
మరికొంత మంది
రాయలసీమ వజ్రాల గనుల్లో దొరకిందని వాదిస్తున్నారు. మొత్తానికి ఇది కాకతీయుల
కాలంలో వెలుగులోనికి వచ్చింది. దీని బరువు 793 కేరెట్స్ (158.6
గ్రాములు). దానిని చాలా కాలంపాటు కాకతీయ రాజులే కాపాడారు. అనంతరం 1310లో
ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ వరంగల్ను ముట్టడించి ఆ వజ్రాన్ని
సొంతం చేసుకున్నాడు. అలా అనేకమంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారిన ఈ
వజ్రాన్ని 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ దక్కించుకున్నాడు. అతని తదనంతరం ఆ
వంశ రాజు అయిన షాజహాన్ కోహినూర్ను తన నెమలి సింహానానికి అలంకరించాడు.
అనంతరం
1739లో మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తిన పర్షియా ప్రభువు నాదిర్ షా దీనిని
వశపర్చుకున్నాడు. ఈయనే ఈ వజ్రానికి ‘కోహ్-ఇ-నూర్ (వెలుగుల కొండ)’ అని
పేరు పెట్టినట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల అనంతరం నాదిర్ షా హత్యకు
గురయ్యాడు. ఆ సమయంలో ఇది నాదిర్ షా సైన్యంలో కీలకపాత్ర పోషించిన అహ్మద్
షా దుర్రాని చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత కాలంలో ఆయన వారుసుడు ఈ
వజ్రాన్ని తన మిత్రుడు అయిన పంజాబ్ మహారాజ్ రంజిత్ సింగ్కు బహుమతిగా
ఇచ్చాడు.
ఆయన తన తదనంతరం ఈ వజ్రం పూరీలోని జగన్నాథ
స్వామి ఆలయానికి చెందాలని వీలునామా రాశాడట. ఆయన మరణానంతరం ఆయన కొడుకు
దలీప్ సింగ్ రాజయ్యాడు. అయితే పంజాబ్లో ఏర్పడిన అంతర్గత కలహాలను
చక్కదిద్దుతామంటూ రంగ ప్రవేశం చేసిన బ్రిటీష్ ప్రభుత్వం ఈ వజ్రంపై
కన్నేసింది. 1849లో జరిగిన రెండో ఆంగ్లో- సిక్కు యుద్ధంలో పంజాబ్ను
ఓడించింది. అప్పుడు వారిద్దరి మధ్య ‘లాహోర్ ఒడంబడిక’ జరిగింది. ఆ
ఒడంబడికలో భాగంగా లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో దలీప్ సింగ్ స్వయంగా ఈ
వజ్రాన్ని బ్రిటన్ మహారాణికి బహూకరించాడు. ఇక, అప్పట్నుంచి ఇది భారత్కు
తిరగి రాలేదు.
No comments:
Post a Comment