హైదరాబాద్: వయసు కొంచెం.. ప్రజ్ఞ ఘనం... ఖమ్మం జిల్లాకు చెందిన మూడో
తరగతి విద్యార్థిని వేల్పుల లక్ష్మి శ్రీజ తన అద్బుత ప్రతిభా పాటవాలతో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ముగ్ధులయ్యారు. వ్యక్తిగత ఖాతా నుంచి రూ.
10 లక్షల 16వేల చెక్కును బహుమతిగా అందజేశారు.
బాగా చదువుకోవాలని లక్ష్మి శ్రీజను దీవించారు. అంతేనా... లక్ష్మిశ్రీజ
ప్రతిభను తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికి భోజనానికి ఆహ్వానించారు.
ఆదివారం వేల్పుల లక్ష్మిశ్రీజ తన తల్లిదండ్రులు సుధారాణి,
కిరణ్కుమార్లతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను
కలిసింది.
ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర నుంచి మొదలు స్వాతంత్య్రం వచ్చాక ఫస్ట్
ఎస్సార్సీ ఏర్పాటు, 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. అనంతం కేసీఆర్
నాయకత్వంలో ఉద్యమ తీరుతెన్నులు, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన
వివరాలు, అపాయింటెడ్ డే సహా రాష్ట్ర మంత్రులు.. వారి శాఖల వివరాలు
గుక్కతిప్పుకోకుండా ముఖ్యమంత్రికి వివరించింది.
సీఎం కేసీఆర్ గురించి, సీఎంగా తన పాలనలోని పథకాల గురించి చెబుతుంటే
ఆశ్చర్యపోయారు. ఏ తీరుగ నను దయచూచెదవో అని ప్రజలు కోరగానే సిరికిం చెప్పడు
శంఖచక్రయుగముల్ చేదోయి సంధించడు.. లాగా వారి కోరికలు తీర్చే నాయకుడు
కేసీఆర్ అని పాప చెప్పింది.
కాగా, ఇప్పటికే ఎన్నో పోటీల్లో పాల్గొన్న లక్ష్మీశ్రీజ ఎన్నో పతకాలు
సాధించింది. ప్రపంచ భౌగౌళిక వివరాలు, ఆయా దేశాల ప్రధానమంత్రుల పేర్లు, భారత
ఆర్థికవ్యవస్థ తీరు, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు, జాతీయ బ్యాంకుల
వివరాలు, యూనివర్సిటీలు, దేశంలోని వివిధ పార్టీలు, వాటి గుర్తులు ఈ
చిన్నారికి అవలీలగా చెప్పేస్తుంది.
తనకు ఐఏఎస్ కావాలనుందని, ఈ పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో తనకు తెలుసని,
కలెక్టర్గా ఖమ్మం జిల్లాకే పనిచేయాలని ఉందని ఏడాది క్రితమే వచ్చీరాని
మాటలతో చెప్పడం విశేషం.
No comments:
Post a Comment