హైదరాబాద్ : తెలంగాణ
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ అనుముల రేవంత్రెడ్డి ఆదివారం ఓ లేఖ రాశారు. తెలంగాణ
అభివృద్ధికి పునాదులు వేసింది ఎన్టీఆరేనని, ఎన్టీఆర్ అభినవ అంబేద్కర్ అని
ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్కు సముచిత స్థానం ఇవ్వాల్సిన
బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు
ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నకేంద్రం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు
చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

No comments:
Post a Comment