సియోల్:
ఇప్పటి పిల్లలకు మాటలు రాకముందే మొబైల్ ఫోన్ వాడటం వచ్చేస్తోంది. రోజూ
గంటలతరబడి ఫోన్ వాడకం సాధారణమైపోయింది. కానీ.. అలాంటి పిల్లలున్న
తల్లిదండ్రులూ తస్మాత జాగ్రత్త అంటున్నారు దక్షిణ కొరియా పరిశోధకులు.
ఎక్కువ సేపు స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయే పిల్లల్లో మెల్లకన్ను వచ్చే
ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా సరే.. వరుసగా అరగంటకు
మించి పిల్లలను స్మార్ట్ఫోన్ చూడనివ్వవద్దని సూచిస్తున్నారు. ఏడేళ్ల
నుంచి 16 ఏళ్ల వయసున్న 12 మంది స్మార్ట్ఫోన్ వినియోగపుటలవాటుపై
పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ పిల్లలందరూ రోజుకు 4 నుంచి 8 గంటలపాటు ఫోన్
వాడే అలవాటున్నవారే. అదీ వారు ఫోన్లను తమ కళ్లకు 20-30 సెంటీమీటర్ల దూరంలో
ఉంచి చూస్తారట. ఆ పన్నెండు మందిలో తొమ్మిది మంది మెల్లకన్ను బారిన పడగా..
రెండునెలలపాటు ఫోన్ వినియోగానికి దూరంగా ఉండడంతో కళ్లు సరయ్యాయి. ఈ
నేపథ్యంలో.. తల్లిదండ్రులు పిల్లల ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తగా
ఉండాలని వారు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment