మెగా అభిమానులకు పండుగ మొదలైంది.
చిరంజీవి రీ ఎంట్రీ కోసం ఎంతో
కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు
మండే ఎండాకాలంలో చల్లని ఐస్క్రీం
లాంటి వార్త. వి.వి.వినాయక్
దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా
తెరకెక్కుతున్న చిత్రం ‘కత్తిలాంటోడు’(వర్కింగ్
టైటిల్). శుక్రవారం ఈ చిత్రాన్ని
లాంఛనంగా ప్రారంభించారు. చిరు
తనయుడు రామ్చరణ్ తన ఫేస్బుక్
ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ...
ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
మెగా ఫ్యామిలీ పాల్గొని సందడి
చేశారు.
పరుచూరి
వెంకటేశ్వరరావు చిరంజీవి నూతన
చిత్రానికి క్లాప్ కొట్టారు.
అల్లు అరవింద్ కెమెరా స్విచాన్
చేశారు. కొణిదెల ప్రొడక్షన్
కంపెనీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.
మరిన్ని వివరాలను త్వరలోనే
వెల్లడిస్తామని చిత్ర బృందం
తెలిపింది. చిరంజీవి 150వ చిత్రం
కావడం, చాలా కాలం తరువాత ఆయన
ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో
మెగా అభిమానులు ‘కత్తిలాంటోడు’
కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ
ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేల్.
పరుచూరి
వెంకటేశ్వరరావు చిరంజీవి నూతన
చిత్రానికి క్లాప్ కొట్టారు.
అల్లు అరవింద్ కెమెరా స్విచాన్
చేశారు. కొణిదెల ప్రొడక్షన్
కంపెనీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.
మరిన్ని వివరాలను త్వరలోనే
వెల్లడిస్తామని చిత్ర బృందం
తెలిపింది. చిరంజీవి 150వ చిత్రం
కావడం, చాలా కాలం తరువాత ఆయన
ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో
మెగా అభిమానులు ‘కత్తిలాంటోడు’
కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ
ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేల్.


No comments:
Post a Comment