Saturday, 30 April 2016

ఆ హోటల్లో శవాలు మాత్రమే ఉంటాయి..!

         
         జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకూ వృద్ధుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి అంత్యక్రియలు జరపడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలా భూమిలో పూడ్చిపెట్టడం, కాల్చడం వంటి పద్ధతులు అక్కడ ఉండవు. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా క్రిమిటోరియంలో శవాలను బూడిద చేయడం ద్వారా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ క్రిమిటోరియాలు శవాలతో కిక్కిరిసిపోవడంతో బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో శవానికి అంత్యక్రియలు చేయడానికి వారం రోజులకు పైగా సమయం పడుతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి వినూత్నంగా వ్యాపారం చేసుకుంటున్నాడు.

 
         శవాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కార్ప్స్ అనే హోటల్‌ను ఏర్పాటు చేశాడు. దాంట్లో ఒక్కరోజుకు ఒక్క శవాన్ని ఉంచడానికి 5800 రూపాయలు తీసుకుంటారు. స్థలాభావం వల్లనో, ఇబ్బందులు ఎందుకనో బంధువులు ఉండటానికి మాత్రం అక్కడ వీలులేదు. కావాలంటే రోజుకు రెండుసార్లు వచ్చి తమవారి శవాలను చూసుకోవచ్చు. ఆసుపత్రుల్లో శవాలను భద్రపరచడానికి ఎలా ఏసీ గదులు ఉంటాయో.. అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. టీఆర్టీ వరల్డ్ సౌజన్యంతో ఆ హోటల్ వీడియోను మీరూ చూడండి..


No comments:

Post a Comment