ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో
ఆరోగ్యశ్రీ అంశంపై తెలంగాణ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
నిర్వహించిన చర్చలు ఓ కొలిక్కిరాలేదు.
ఆదివారం మధ్యాహ్నం తమ నిర్ణయం
చెబుతామని ఆస్పత్రి యాజమాన్యాలు
మంత్రికి స్పష్టంచేశాయి. ఆరోగ్యశ్రీ
విషయంపై చర్చించేందుకు ప్రయివేటు
ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి
భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రుల ఖాతాల్లోకి నిధులు చేరుతాయని హామీ ఇచ్చారు.
ఈ చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రుల ఖాతాల్లోకి నిధులు చేరుతాయని హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment